వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా శాసనమండలి ఛైర్మన్ మోషేన్రాజు మాట్లాడుతూ...గత ప్రభుత్వాల కాలంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ జగన్మోహన్రెడ్డి పాలనలో అది ఒక విధానమయింది. మనకు ఈ ప్రభుత్వం ఏంచేసింది అన్నది వివరించడానికే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతోంది. మహానుభావులు అంబేడ్కర్, ఫూలేల ఆలోచనలే స్పూర్తిగా తన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడం గొప్ప విషయం. అనేక సంక్షేమకార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పేదల స్థితిగతులను మెరుగుపరచిన ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. గతంలో డబ్బున్న పిల్లలు సూటు బూట్లతో స్కూళ్లకు వెళుతుంటే, ఇంగ్లీషు మాటలు మాట్లాడుతుంటే, పేదకుటుంబాల్లోని అమ్మానాన్నలు తమ లేమి తనాన్ని తలుచుకుని ఎంతగానో బాధపడ్డ రోజులున్నాయి. కానీ నేడు జగనన్న ఆ సౌకర్యాలన్నీ పేదపిల్లలకు కల్పించారు. ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వపాఠశాలలను తీర్చదిద్దుతున్నారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa