ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ పాలనను అంతం చేయటమే టీడీపీ, జనసేన లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 04:54 PM

రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని, అరాచక పాలన సాగిస్తున్న సైకో జగన్‌ పాలనను అంతం చేయటమే టీడీపీ, జనసేన పార్టీల లక్ష్యం కావాలని, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప మోమోరియల్‌ హాల్‌లో గురువారం టీడీపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు ముగతి ఈరన్న గౌడ్‌, పుష్పావతి, నాగరాజు గౌడ్‌, మల్లికార్జున, చిన్నరాముడు, జనసేన పార్టీ ఇన్‌చార్జి రేఖాగౌడ్‌, చల్లా వరుణ్‌, భాస్కర్‌ తదితరులు హాజరయ్యారు. బీవీ మాట్లాడుతూ.....  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్‌ కక్షపూరిత పాలన సాగిస్తు ప్రజలను, ప్రతిపక్షాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, జనసేన అధినే పవన్‌ కల్యాణ్‌కు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రైతాంగాన్ని సర్వనాశనం చేసి రాయలసీమ ద్రోహిగా నిలిచారన్నారు. టీడీపీ, జనసేన బూత్‌ స్థాయినుంచి సమన్వ యంతో పని చేయాలని కోరారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి రేఖాగౌడ్‌ మాట్లా డుతూ టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయినుంచి సమన్వయంతో ఎటువంటి బేదాభిప్రాయాలు లేకుండా మందుకు సాగుదా మన్నారు. నాలుగున్న రేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు అంతమో ద్దిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మిగనూరు పట్టణం, మండలం, నందవం, గోనెగండ్ల మండలాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa