కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ బదిలీ అయ్యారు.ఆజాద్ను ప్రభుత్వం శ్రీకాళహస్తికి బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నవరం ఆలయ ఈవోగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ను డిప్యుటేషన్పై నియమించారు. ఇప్పటివరకు శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఇంఛార్జ్ బాధ్యతలు చూస్తున్న కేవీ సాగర్బాబును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన పోస్టు అయిన అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు.
దేవాదాయ కమిషనరేట్లో సంయుక్త కమిషనర్గా ఉన్న ఆజాద్కు ఈ ఏడాది మార్చిలో అన్నవరం ఆలయ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత నెలలో ఆయనకు ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మార్చిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఆజాద్ స్థానంలో దేవాదాయ కమిషనరేట్లో అదనపు కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్ను.. ఆయన హోదా కంటే చిన్నదైన సంయుక్త కమిషనర్ కేడర్ కలిగిన అన్నవరం ఆలయ ఈవోగా బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. డిప్యుటేషన్ పేరిట ఆయన్ అన్నవరం పంపించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల విజయవాడ ఆలయ ఈవో భ్రమరాంబను కూడా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa