టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని టీడీపీ నేత అచెం నాయుడు అన్నారు. రోజూ స్వచ్ఛందంగా లక్షలాది మంది భవిష్యత్ గ్యారెంటీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ అసహనంలో ఉన్నారని పేర్కొన్నారు.అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి బులుగు బ్యాచ్ చేరిందని అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడపగడప ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ నేతలను ప్రజలు తరిమి తరిమి కొట్టారని అన్నారు. టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీకి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, ఆ అసహనంతో జగన్ ముఠా పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో అందించే పథకాల గురించి చెబుతుంటే ఎందుకంత అసహనం అని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామంటే వైసీపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామంటే ఎందుకంత అసహనమని, ఏటా 3 సిలిండర్ల హామీపై ఎందుకంత కడుపు మంట అని అన్నారు. అన్నదాతకు రూ.20 వేలు ఇస్తామంటే ఎందుకంత అక్కసు అంటూ విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa