ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల డేటా వైసీపీ చోరీ చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 02:19 PM

 భవిష్యత్ గ్యారెంటీపై జగన్ రెడ్డి, ఆయన గుమాస్తా సజ్జల అవాకులు, చెవాకులు పేలుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్ల నమోదు ఐప్యాక్, తాడేపల్లి ప్యాలెస్ కుట్రే అని ఆరోపించారు. పీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా వాలంటీర్ల నుంచి ప్రజల వ్యక్తిగత వివరాలు చట్టవిరుద్ధంగా సేకరిస్తున్నారన్నారు. ఈ సమాచారం అంతా రామ్ ఇన్పోటెక్‌కు పంపిస్తున్నారని.. దీని కోసం రూ. 270 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రజల డేటా వైసీపీ చోరీ చేస్తూ టీడీపీపై ఆరోపణలు చేయటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారా టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించే సంక్షేమం గురించి ప్రజలు చెప్తుంటే వైసీపీకి భయమెందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa