స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకానికి ఆంధ్రప్రదేశ్ అర్హత పొందలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో మంగళవారం బీజేపీ ఎంపీలు నారాయణ కొరగప్ప, జీవీఎల్ నరసింహారావులు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీం కింద రాష్ట్రాలకు 97,374 కోట్ల ప్రత్యేక సాయం అందించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్, కేరళలు అర్హత సాధించలేదని తెలిపారు.
వాస్తవానికి ఈ పథకం కింద ఏపీకి 2023-24లో రూ.4,047 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్, వెల్నెస్ సెంటర్లు, ప్రధాన మంత్రి గ్రామీణ, పట్టణ ఆవాస్ యోజన, సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు సంబంధించిన పేర్లు, మార్గదర్శకాలు, నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఫిర్యాదు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అందువల్ల ఈ స్కీం కింద ఏపీకి నిధులు మంజూరు చేసే అంశం ఆ రాష్ట్రం నిబంధనలు పాటించినట్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలపై ఆధారపడి ఉంటుందన్నారు.
కేంద్రం రాష్ట్రాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ ఏడాది మొత్తం రూ.56వేల415కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించారు.. కానీదిఆంధ్రప్రదేశ్కు మాత్రం విడుదల కాలేదు. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్ంలో రూ.56,415 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఆమోదించింది. కేంద్రం ఇస్తున్న ఈ నిధుల్ని రాష్ట్రాల్లో విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, నీటి పారుదల, రహదారులు, విద్యుత్ వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa