శబరి యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు మృతి చెందారు. వీరిని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం చెందినవారిగా గుర్తించారు. గ్రామానికి చెందిన ఐదుగురు స్వాములు.. వాహనంలో శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వీరి వాహనం తమిళనాడులో ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో.. ముగ్గురు స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయానికి అందులో మొత్తం ఐదుగురు భక్తులు ఉన్నట్లు సమాచారం. తమిళనాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులను కమలాపురానికి చెందిన సుబ్బయ్య నాయుడు, నర్రా సాంబయ్య, కొట్టు రాజుగా గుర్తించారు. ఈ ఘటనతో కమలాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరు తమిళనాడు మీదుగా వస్తూ మార్గమధ్యలో కారు నిలిపి, భోజనాలు వండుకొని తిని బయలు దేరినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగినట్టు సమాచారం. టీఎస్ 25జీ 4596 రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా బాధితులు తెలంగాణ వాసులని గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa