ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం ప్రజాగళంగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 04:46 PM

టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. యువత ఆశయాలకు అద్దం పట్టే ప్రజాగళంగా మారుద్దామన్నారు. ఒక్క అడుగుతో మొదలై యువత ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచిందని తెలిపారు. 226 రోజులపాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3132 కిలో మీటర్లు విజయవంతంగా సాగిందన్నారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహిస్తున్న యువగళం - నవశకం సభను చారిత్రాత్మకంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa