ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఉక్కుకి టీడీపీ అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 04:47 PM

విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణను అంగీకరించబోమని టీడీపీ యువనేత లోకేష్ స్పష్టం చేశారు. అయన మాట్లాడుతూ... భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడివడి ఉన్న ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు భయపడి జగన్మోహన్‌రెడ్డి నోరు మెదపడం లేదు. కొందరు బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయితే ఖాళీగా ఉన్న సుమారు 8వేల ఎకరాల భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు జగన్ వ్యూహరచన చేశాడు. 5కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి జగన్‌రెడ్డి కమీషన్ల కోసం, ప్లాంట్‌లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో మా గళాన్ని వినిపిస్తాం. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపడతాం.విశాఖ ఉక్కు మనుగడకు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కాస్ట్ కటింగ్ వంటి అంశాలపై దృష్టిసారించి, రాష్ట్రప్రభుత్వం తరపున అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తాం’’ అని నారా లోకేష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa