తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా నిన్న విజయనగరం జిల్లా పోలిపల్లిలో బహిరంగ సభ పెట్టారు. బస్సులు, ట్రైన్లలో రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అద్భుతమైన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని.. లోకేశ్ యువగళం యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు లక్షల మందికి పైగా జనం హాజరవుతారంటూ ముందుగానే ప్రచారం చేసుకున్నారు. తీరా.. అక్కడకొచ్చిన జనాన్ని చూస్తే వీళ్ల బహిరంగ సభ కార్యక్రమం కాస్త తుస్సుమంది. ఆరు లక్షల మంది జనాలు వస్తారని మీరు ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..? వచ్చిన వాళ్లు ఎంతసేపు ఉన్నారు..? ఎవరి ఉపన్యాసాలు విన్నారు..? మధ్యలోనే వాళ్లంతా ఎందుకు వెళ్లిపోయారు..? వీటిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు విశ్లేషించుకుంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa