ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో క్రీడలపట్ల ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం తమ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరలేదని కేంద్ర క్రీడా, యువజన శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 15 ఏళ్ళు పైబడిన యువత కోసం అన్ని గ్రామాలు, వార్డు సచివాలయల నుంచి మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. యువతలో చురుకైన జీవనశైలిని తీసుకురావడానికి, వారిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. అలాగే గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో క్వాలిఫై అయిన జట్లు మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయని మంత్రి తెలిపారు. క్రీడలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహించడం ప్రధానంగా ఆయా రాష్ట్రాల బాధ్యత. వీటికి తోడ్పాటు అందిచేందుకు కేంద్ర ప్రభుత్వం సాయ పడుతూ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa