అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. గురువారం నాడు మంత్రి ఉషశ్రీ చరణ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచాం. ఉద్యోగ విరమణ వయస్సును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే ఏపీలో 11,500 కు వేతనాలను పెంచాం. పదోన్నతి వయస్సును 45-50కి పెంచాం. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హతను బట్టి అంగన్వాడీ లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదు. ఆయా జిల్లా కలెక్టర్లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారు’’ అని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa