ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వామివారి హుండీ ఆదాయం తెలిపిన ఆలయ నిర్వహికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 11:01 PM

 కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీలను బుధవారం పర్యవేక్షణాధికారులు కేఎన్వీడీవీ ప్రసాద్‌, ఎం.రాధాకృష్ణ, ఎన్వీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెరిచి లెక్కించారు. 29 రోజులకు ప్రదాన హుండీల ద్వారా రూ.60,55,845, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.24,60,434... వెరసి రూ.85,16,279 ఆదాయం లభించింది. బంగారం పది గ్రాములు, వెండి 900 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించాయి. క్షేత్ర పాలకుడు విశ్వేశ్వరస్వామి హుండీల అదాయం రూ.2,52,976 లభించినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa