ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్ప్రెస్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలో మీదుగా నడవనుంది. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో 12 స్లీపర్ తరగతి, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది.
రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్ప్రెస్ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. దానికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఈ రెండు తరగతుల్లో ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసేదీ తెలిపే పట్టికను దానికి జతచేసింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని (రీయంబర్స్ చేయని) రాయితీ/ ఉచిత టికెట్లను ఈ రైల్లో అనుమతించరు.
రైల్వే సిబ్బందికి ఇచ్చే పాసులు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీవో)ల విషయంలో నిబంధనలు.. మెయిల్/ ఎక్స్ప్రెస్లతో సమానంగా ఉంటాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల టికెట్ల సొమ్మును ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నందువల్ల వారి పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయి. తొలిరైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి. ఏసీ తరగతుల ఛార్జీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న రెండు 'అమృత్ భారత్ ఎక్స్ప్రెస్' రైళ్లను ప్రారంభించే అవకాశాలున్నాయి. మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. యూపీలోని అయోధ్య నుంచి బీహార్లోని దర్బంగా వరకూ ప్రయాణించనుంది. ఈ రెండు ప్రాంతాలు శ్రీరాముడు, సీతమ్మతో అనుబంధమున్న ప్రాంతాలు. కాగా, రెండో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణాదిన నడుస్తుంది. బెంగళూరు నుంచి మాల్డా రూట్లో ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రైలులో సాఫీ ప్రయాణానుభూతిని కల్పించే జెర్క్ ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు చేశారు. జీరో డిశ్చార్చ్ ఎఫ్ఆర్పీ మాడ్యులర్ టాయలెట్.. ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఉంది. ఇరువైపులా ఏరోడైనమిక్ డైజైన్డ్ డబ్ల్యూఏపీ5 లోకోమోటివ్లు.. అధునాతన కుషన్డ్ లగేజ్ ర్యాక్ ఏర్పాటు చేశారు. తేలికపాటి బరువు, మడతపెట్టేందుకు వీలున్న స్నాక్ టేబుల్.. బాటిల్ హోల్టర్, మొబైల్ చార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్లు ఉన్నాయి. ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్ క్యూబికెల్స్.. పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్వేలు.. రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa