ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇస్తే.. వారిని కోలుకోలేని దెబ్బకొట్టాడని టీడీపీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. జగన్ కోట్లు దోచుకున్నాడన్నారు. కుక్క తోక వంకర అన్నట్లుగా.. జగన్లో మార్పు రాలేదన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి, మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడని తెలిపారు. నక్క వినయాలతో మొసలి కన్నీరు కార్చడంతో ప్రజలు కూడా నమ్మారన్నారు. సీబీఎన్ ఫోరం కార్యక్రమాలు.. జగన్ కుయుక్తులను తిప్పి కొట్టేలా ఉన్నాయని అభినందించారు. ప్రజలను ఆలోచింప చేసేలా, చైతన్యం తీసుకొచ్చేలా అంశాల వారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారని కితాబిచ్చారు. దళిత గళం పేరుతో జగన్ ఎస్సీ, ఎస్టీలకు మోసం చేసిన తీరును చక్కగా వివరించారని చెప్పారు. నందిగామలో తంగిరాల సౌమ్య వంటి మానవతావాదిని గెలిపించాలని కోరారు. జగన్ పాలనలో దళితులపై ఎన్ని దాడులు చేశారో అందరికీ తెలుసని, మహిళలు అని కూడా చూకుండా దారుణాలకు ఒడిగట్టారన్నారు. జగన్కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అబద్దపు మాటలు, అసత్యాలు, వాగ్దానాలతో అసమర్ధ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను సాగనంపాలని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa