అకాలీదళ్ ప్రభుత్వంలో మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై పంజాబ్ పోలీసులు మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. మజిథియాపై డ్రగ్స్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన నాలుగో సిట్ ఇది. పాటియాలా డీఐజీ హెచ్ఎస్ భుల్లర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్లో ధురి ఎస్పీ యోగేష్ శర్మ, పాటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ ఉన్నారు. డీజీపీ గౌరవ్ యాదవ్ ఆమోదంతో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏడీజీపీ కమ్ డైరెక్టర్ ఎల్కే యాదవ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 31న ఏడీజీపీ ఎంఎస్ చిన పదవీ విరమణ చేసిన నేపథ్యంలో సిట్ను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబరు 20, 2021న అప్పటి ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మజిథియాపై కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వచ్చిన ఆరోపణలపై అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బల్రాజ్ సింగ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa