తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రప్రభుత్వం, సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు మానుకోకపోతే మొబైల్లోని ఫొటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. తన మొబైల్లోని డేటాను బహిర్గతపర్చకుండా నిరోధించేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో కిరణ్ రాయల మొబైల్ను పోలీసులు సీజ్ చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర వాదనలు వినిపించారు. కిరణ్ మొబైల్లో ఉన్నKiran Royal Ap High Court Petition, Kiran Royal, AP High Court,Kiran Royal Petition, ఏపీ హైకోర్టు, ఏపీ హైకోర్టులో కిరణ్ రాయల్ పిటిషన్, కిరణ్ రాయల్, కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టు పిటిషన్
ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. డేటాను బహిర్గతం చేస్తామనడం గోప్యత హక్కును హరించడమేనని.. ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్ష నేతలను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. ఆధారాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలుచేయాలని చిత్తూరు జిల్లా నగరి పాత సీఐ శ్రీనివాసంతి, నగరి డీఎస్పీ రవికుమార్, రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీఎస్ తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa