చిత్తూరు జిల్లాలో స్కూలుకి వెళ్లిన అమ్మాయిని వైసీపీ ముఠా గంజాయికి బానిసని చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గంజాయికి అడిక్ట్ అయిన బాలికపై లైంగిక దాడులకి పాల్పడ్డారన్నారు. తన కంటిపాపని రక్షించుకోలేక ఆ తల్లి అనుభవించిన నరకం తన కళ్ల ముందు ఇంకా కదలాడుతోందన్నారు. ఆ అమ్మాయిని డీ అడిక్షన్ సెంటర్కి పంపామని నారా లోకేష్ వెల్లడించారు. వైసీపీ పాలనలో బడిలో, గుడిలోకి గంజాయి వచ్చేసిందన్నారు. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారన్నారు. నియంత్రించాల్సిన సర్కారే ప్రోత్సహిస్తోందని రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తంచేస్తే, ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారు. జగన్ ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుడిని పట్టుకోలేదు. సీఎం ఇంటికి దగ్గరలో మద్యం మత్తులో ఒక ఉన్మాది అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవు. విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్ , మద్యం విషాదాలు చూసి ఆవేదనతో కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరాను, లేఖలు రాశాను. డ్రగ్స్ కట్టడి చేయాల్సిన సర్కారు నాపై మాటల దాడి, టిడిపి కార్యాలయంపై దాడులకి పాల్పడింది కానీ కనీస చర్యలు తీసుకోలేదు. పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనం కావడం చూసి ఆందోళనతో ప్రధానికి లేఖ రాశాను. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకూ పోరాడుతూనే ఉంటాను.చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో ఏడవ తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం తాగుతుండగా, వీడియో తీసిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనానికి కారణమైన దండుపాళ్యం వైసీపీ సర్కారుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీలేని పోరాటం సాగిస్తున్నాం. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, ప్రమాదకర మద్యంపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలారా గంజాయి/డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దాం రండి. మన పిల్లల్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం’’ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa