గుంతకల్లులో మంగళవారం జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రకు నియోజకవర్గం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు, వైయస్ఆర్సీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో పాటు వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన సంక్షేమ రథసారథి జగనన్నేనని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్, మాజీ చైర్మన్ రామలింగప్ప, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో– ఆప్షన్ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa