‘‘రాజధానితో పాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలి. ఈ దిశగా నేను ఆలోచిస్తాను. కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అనే ఆలోచన కాకుండా.. వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాలు కూడా అద్భుతమైనవి అనేలా తీర్చిదిద్దాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయన మాట్లాడుతూ..... నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను... అని చెప్పను. అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది నేరాలకు ప్రధాన మూలం. గంజాయి మత్తులో నేరాలు పెరిగాయి. నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలి. అధికారంలోకి వచ్చాక యువత గొంతు అవుతా. నేను యువత చెప్పే ప్రతి ఆలోచనలను జాగ్రత్తగా వింటాను. అవసరమైతే అన్నీ ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకొస్తాను. వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తా. యువతకు మంచి భవిష్యత్ ఇచ్చేలా భరోసా ఇస్తాం’’ అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa