కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం లాంటి నిజాయితీగల వారు జనసేనలోకి వస్తే మరింత బలం చేకూరుతుందని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాడు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో ముద్రగడతో మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వస్తారని. ఈ నెలలోనే ముద్రగడతో పవన్ భేటీ ఉంటుందని తెలిపారు. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వస్తూ ఉంటాయని అవి సర్దుకుని ముందుకు వెళ్తామన్నారు. పవన్, ముద్రగడ మధ్య గ్యాప్ ఉంటే వేరే పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి జనసేనకు వస్తే సమాజానికి మంచి జరుగుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa