ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకి తెలపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 09:18 PM

రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు సమష్టి కృషితో పార్టీని గెలిపించాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కార్యకర్తలను కోరారు. మండలంలోని పెద్దయాచవరం, నాయుడుపల్లి, గజ్జలకొండ గ్రామాలలోని పార్టీ కమిటీ, బూత్‌ కమిటీ, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్‌, గ్రామ కమిటీలు ప్రతి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలకు అవగావహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షు లు జవ్వాజి రామానుజుల రెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు గొలమారి నాసర్‌రెడ్డి, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa