ఏపీ హైకోర్టులో కోడికత్తి శ్రీను బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలైంది.. అత్యవసరంగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఐదురోజుల నుంచి జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు మహేష్. ఐదేళ్ల నుంచి బెయిల్ లేకుండా జైలులో శ్రీను ఉన్నారని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలను కూడా కోర్టుకు వివరించారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది.. మంగళవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
మరోవైపు కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. విజయవాడలో సావిత్రమ్మ, సుబ్బరాజు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆసుపత్రిలో కూడా వైద్యానికి నిరాకరించి దీక్షను కొనసాగించారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వచ్చి మాట్లాడారు. న్యాయపోరాటం చేద్దామని, దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో ఆదివారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు సావిత్రమ్మ, సుబ్బరాజులకు ఓఆర్ఎస్ ఇచ్చి దీక్ష విరమింపజేయించారు. శ్రీను దాదాపు ఐదేళ్లగా జైలులో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దళితులంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 24న దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పి.. తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి, సోదరుడు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa