విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు సంబంధించి గుడ్న్యూస్ వచ్చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. కేంద్ంర సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని.. భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందన్నారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా.. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ఓఎస్డీ స్థాయి అధికారిని కేంద్రం విశాఖలో నియమించిందని వెల్లడించారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందన్నారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం దశలవారీగా అమలు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న రోజులను చంద్రబాబు మరిచిపోయినా.. జనాలు వి షయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారన్నారు.
రాష్ట్రానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి వెన్నెముక వంటిదని.. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని.. ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామన్నారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదన్నారు. చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయని.. ఉత్తరాం«ధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలిసిన పాపానపోలేదన్నారు. వారు ఈ విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఎంపీ సత్యవతి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa