జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు. మిత్ర ధర్మ పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పోటీగా.. రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. అరకు, మండపేటలో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్నారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలని.. కానీ, టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. టీడీపీ-జనసేన పొత్తులపై ఇష్టం మాట్లాడుతున్నారని.. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నానన్నారు.
ఇప్పుడు ఏకపక్షంగా వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తామన్నారు పవన్. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. కొన్ని ప్రత్యేక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఉన్నట్లే.. తనకూ పార్టీలో ఒత్తిడి ఉందన్నారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని.. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామన్నారు. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నామన్నారు.
అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగిందన్నారు పవన్. దీనిపై తనను అడిగిన పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదని.. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయిగానీ అధికారంలోకి వస్తామోరామో తెలియదన్నారు. పవన్ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారని.. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తానన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. అందుకే తనకు నిర్మించడం ఇష్టమన్నారు.
ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసన్నారు పవన్. 50 తీసుకోండి 60 తీసుకోండి.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు అన్నారు. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసే వాళ్ళం.. గత ఎన్నికలలో 18 లక్షల ఓట్లు సంపాదించాము అన్నారు. జగన్ అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు జనసేనను కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మిగిలిన వాళ్లను వదులుతారా? అన్నారు. జగన్ కు ఊరంతా శత్రువులే.. వైఎస్సార్సీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలన్నారు.
లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని.. సీనియర్ నేతగా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి.. వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నానని.. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు.. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు జనసేనాని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa