ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ సీట్లు, అభ్యర్థుల ఎంపికతోపాటుగా పార్టీల మధ్య మాటల మంటలు కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా సీట్ల సర్దుబాటు గురించి చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆదివారం రెండు దఫాలుగా చంద్రబాబు ఇంటికెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ కూడా వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్పై ఓ రేంజులో సెటైర్లు పేల్చే అంబటి రాంబాబు.. ఈ భేటీ విషయంలో కూడా తనదైన స్టైల్లో సెటైర్లు పేల్చారు.
చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఉదయం, సాయంత్రం రెండుసార్లు వెళ్లింది.. ప్యాకేజీ ముష్టి కోసమా.. సీట్ల ముష్టి కోసమా అంటూ అంబటి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ను నమ్మి ఆయన వెంటే నడిస్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని జనసైనికులకు సలహా ఇచ్చారు. చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్ కార్యకర్తల్ని ముంచుతాడని అన్నారు. చంద్రబాబు మహా అయితే జనసేనకు 20 నుంచి 25 స్థానాలు ఇస్తాడన్న అంబటి రాంబాబు.. అంతకుమించి ఇవ్వరనేది జనసేన నేతలకు కూడా తెలిసిన జగమెరిగిన సత్యమని అన్నారు. ఆ సీట్ల ముష్టి తీసుకునే గత్యంతరం లేని పరిస్థితిలో జనసేన ఉందన్నారు. టీడీపీ- జనసేన నేతలు ఎన్నికలకు ఇంకా సిద్ధం కాలేదని.. వైసీపీ ఎన్నికల విషయంలో దూసుకెళ్తోందని అంబటి అన్నారు. జనసేన, టీడీపీ మాత్రం సీట్లు,నోట్లు లెక్కేసుకునే పనిలో ఉన్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు కనపడినవాళ్ళందరినీ రా.. కదలిరా అంటున్నారనీ, కానీ ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారు
మరోవైపు లోకేష్ను టీడీపీ దాచిపెట్టిందంటూ అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఆయన్ని జనంలోకి పంపిస్తే టీడీపీ ఔట్ అనే సందేహంతోనే దాచేశారని ఎద్దేవా చేశారు. లోకేష్ ను దాచేసినా, బయటపెట్టినా టీడీపీ ఔటేనన్న అంబటి.. పాదయాత్ర చేసిన వీరుడు, సూరుడు అని చెప్పిన లోకేష్ను పక్కనపెట్టేశారని విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీని వీడి జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై సైతం అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో టికెట్ రాని బఫూన్లు వేరే పార్టీలో చేరతారన్న అంబటి.. బఫూన్ బాలశౌరి చరిత్ర అంతా తమకు తెలుసని అన్నారు. జనసేనలో చేరిన సందర్భంగా బాలశౌరి కాస్త ఓవర్గా మాట్లాడాడన్న అంబటి రాంబాబు.. ఆయన ఓవరాక్షన్ చూసి పవన్ కళ్యాణ్ కూడా నమ్మలేకపోయాడని అన్నారు. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కావునే వైసీపీ టికెట్ తిరస్కరించిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బాలశౌరి గురించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు బాగా తెలుసని అబంటి అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa