టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం సభను జయప్రదం చేయాలని పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పిలుపునిచ్చారు. పాలకొండ- వీరఘట్టం రోడ్డులో మంగళవారం లోకేశ్ నిర్వహించనున్న శంఖారావం సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ.. అరాచక పాలన చేపడుతున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శంఖారావం పేరుతో లోకేశ్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో రానున్న ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారన్నారు. స్థానిక నాయకుల ద్వారా సమస్యలను తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. వైసీపీ సర్కారు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని దీక్షతో లోకేశ్ను యువగళం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. చివరకు మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపైనా అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడేందుకు జనసేనతో కలిసి అంతా పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ సర్కారు ఓటమి ఖాయమని, టీడీపీ విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్, నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, నాయకులు క అప్పలనాయుడు, కృష్ణమూర్తినాయుడు, రామినాయుడు, సంతోష్కుమార్, నారాయణరావు, ఉదయ్భాస్కర్, జనసేన నాయకులు నిమ్మక నిబ్రం, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa