ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 03:16 PM

అనంత‌పురం జిల్లా గాండ్ల‌పెంట‌ మండలం, పోతవాండ్లపల్లి నుంచి జీనులకుంట వరకు రూ. 53.00  లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సహకారంతో నేడు రూ. 53 లక్షల రూపాయలతో 100 సంవత్సరాలు మన్నిక కలిగిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, కల్వర్టులను నిర్మించుకున్నామన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోనటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా 135 గ్రామాలకు అప్రోచ్ రోడ్లను నిర్మించామన్నారు.  ఈ రహదారుల ద్వారా  ప్రజలకు అత్యవసర సేవలను (108 & 104 వాహనాలను) అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.  జగనన్న ఆనాడు చెప్పిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాలను దృష్టిలో ఉంచుకొని వారి కంటే రెండు అడుగులు ముందుకేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారన్నారు.  కులం మతం వర్గం పార్టీ అన్న బేధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుని ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందజేయడం జరుగుతున్నదన్నారు. వీటన్నిటిని చూసి ఓర్వలేని కొందరు దుష్టులు జగనన్నపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారన్నారు.  అధికారం అడ్డం పెట్టుకొని గతంలో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టు దోచుకుతిన్నారన్నారు.   మరి ఈనాడు ఏ గ్రామానికి వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్ చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని, వీటన్నిటినీ ప్రజలు గమనించి, అభివృద్ధికే పట్టం కట్టాలన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa