ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోసం సైనికుడిలా పని చేస్తానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు. ఫేక్లే పార్టీ మారతారు.. నిజంగా వైయస్ జగన్ను అభిమానించేవారు పార్టీ మారరని పేర్కొన్నారు. మంగళవారం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.... నెల్లూరు సిటీ నుంచి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను.. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా.. రెండుసార్లు విజయం సాధించాను.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను.. వైయస్ జగన్ కోసం సైనికుడిలా పని చేస్తాను.. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు.తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా వైయస్ జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. వైయస్ జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa