ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 07:59 PM

వైయ‌స్ఆర్‌సీపీకి ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు రాసే పిల్లల్లా..ప్ర‌తి కార్య‌క‌ర్త‌ పని చేయాలి. రాబోయే ఈ 50 రోజులు ఇదే పని అని గుర్తు చేశారు.  సునామీలాగా వస్తున్న ఆదరణను.. పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్ లను(ఒకటి అసెంబ్లీ, రెండోది లోక్‌సభ కోసం) నొక్కించాలి అని సజ్జల అన్నారు.  సంక్షేమ పాలన అందిస్తున్న వైయ‌స్‌ జగనా?.. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా? అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం పార్టీ కేంద్ర‌ కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం కార్య‌వ‌ర్గ స‌మావేశంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు.  2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం. అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో  ప్రజలకు తెలిసి వచ్చింది. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్ల లో తిరుగుతున్నాడు అని సజ్జల ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు. సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని వైయ‌స్ జగన్ తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది.  అన్ని వర్గాలకు వైయ‌స్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు.  కొన్ని కులాల్లో నాయకులు  దొరకని పరిస్థితి ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారు. అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాం. మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాం. ఇకపై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం అని సజ్జల పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa