విశాఖపట్నం.. పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా.. విశాఖను గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. అందుకే.. దిగ్గజ పారిశ్రామికవేత్తలు వైజాగ్కు క్యూ కట్టారు. భవిష్యత్తులో విశాఖ వైభవాన్ని విశ్వం వినువీధుల్లో ప్రతిబింబించేలా సమగ్ర కార్యచరణను అమలు చేసే ప్రణాళికలతో సీఎం వైఎస్ జగన్ ముందుకొస్తున్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో విజన్ విశాఖ సదస్సులో పాల్గొంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో నడిచేలా విశాఖను నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సైతం అడుగులు పడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa