ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరులో అనూహ్య పరిణామం.. టీడీపీ అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యే మద్దతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 10:05 PM

చిత్తూరులో అనూహ్యం పరిణామం జరిగింది. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మద్దతు తెలిపారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల సమరానికి అందరూ సిద్ధం కావాలని నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ వివిధ కార్యక్రమాలతో విస్తృతంగా పర్యటించారు. జగన్మోహన్ సీకేబాబును మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు తన నివాసంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను గత ఐదేళ్లుగా టీడీపీలోనే ఉన్నా.. వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు.


రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ గెలుపు కోసం కృషి చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అరాచక పాలనకు అంతం పలికి టీడీపీ, జనసేన పార్టీల కూటమిని గెలిపించుకోవాలని.. చిత్తూరు నియోజకవర్గంలో జీజేఎన్‌ భారీ మెజారిటీతో గెలిచేలా అందరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మొదటి సారి టీడీపీ కండువాతో కనిపించారు. సినీ నటుడు సప్తగిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనుండగా.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌కు మద్దతు ప్రకటించారు. చిత్తూరులో ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా, మూడుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబు.. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఆత్మీయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించి.. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2009లో గెలుపొందారు. దాదాపు పదేళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa