నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులకు నాలుగు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు, ఐదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకునే వివరాలను సైతం ఏపీపీఎస్సీ వెల్లడించింది.
మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మార్చి 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 10 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. 37 ఫారెస్ట్ అధికారి పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. మే 5 వరకు ధరఖాస్తులను స్వీకరిస్తారు. ఐదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. మే 8 వరకూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నాలుగు ఫిషరీష్ డెవలప్ మెంట్ అధికారి పోస్టులకి ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అప్లై చేసుకునేందుకు మే 13ను ఆఖరితేదీగా నిర్ణయించారు. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మీద కూడా ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. మార్చి 17వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లోని 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa