దెందులూరు నియోజకవర్గంలో యువకులపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ ప్రతిపక్షాలపై జగన్ అండ్ కో విమర్శలు గుప్పిస్తున్నారని.. దెందులూరులో జరిగిన ఘటనతో పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా? అంటూ ఎద్దేవా చేశారు. తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్ అండ్ కో ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa