ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది వాలంటీర్ వ్యవస్థ కదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 09:32 AM

వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన‌ శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్‌ బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు న‌మోదు చేయాల‌ని ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి డిమాండు చేశారు. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని ఆయ‌న‌ హితవు పలికారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది వాలంటీర్ వ్యవస్థ కదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వాలంటీర్లను అవమానించడం సరికాదు.. కరోనా సమయంలో విదేశాలలో ఉన్నవారి తల్లిదండ్రులకు సహాయపడింది వాలంటీర్ వ్యవస్థ అన్నారు. కరోనా సమయంలో టీడీపీ జన్మ భూమి కమిటీలు ఏమైయ్యాయని నిలదీశారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ అంటూ  ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ మండిప‌డ్డారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa