ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రము నాశనమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:46 AM

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని కూటమి పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ సతీమణి శిరీష దుయ్య బట్టారు. ఆమె బుధవారం గూడూరు మండలం రామన్నపేటలో ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చిన జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్న కసితో ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు పవన్‌కల్యాణ్‌, నరేంద్ర మోదీల నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆమె ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై కరపత్రాలను అందించారు. కాగిత కృష్ణప్రసాద్‌ను ఆదరించి ఆశీస్సులు అందచేయాలని శిరీష కోరారు. గోపీ నాగబాబు, ఎన్‌ఏ బేగ్‌, కాసగాని శ్రీనివాసరావు, సిరి వెళ్ల శ్రీనివాసరావు, శాయన సోమయ్య, పోతుల రాము, కారుపర్తి శ్రీని వాసరావు, పిచ్చుక విజయ్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa