ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌ జిల్లా కూటమి అభ్యర్థులు ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:46 AM

విజయవాడ పశ్చిమ సీటుపై స్పష్టత రావడంతో ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అవనిడ్డ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి రేసులో ప్రముఖ వ్యాపారవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌, ఎన్‌ఆర్‌ఐ బొబ్బా గౌతమ్‌, అప్పికట్ల అప్పారావు, మాదివాడ వెంకటకృష్ణ రామాంజనేయులు ఉన్నారు. వీరిలో విక్కుర్తి శ్రీనివా్‌సకు టికెట్‌ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు స్థానాలతో పాటు మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఈ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa