కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. అక్కా తమ్ముళ్లే ప్రత్యర్థులుగా మారి తలపడనున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కడప పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. అయితే కడప నుంచే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందనే కారణాన్ని వైఎస్ షర్మిల వెల్లడించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎక్కడినుంచైనా పోటీ చేసే అవకాశం షర్మిలకు ఉంది. అయితే కడపనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో ఆమె మీడియాకు వివరించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. తాను ఎందుకు కడపలోనే పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.
" కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్నా.ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకున్నది కాదు. నేను కడపలో పోటీ చేస్తే మా కుటుంబం చీలిపోతుందని తెలుసు. అయినా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా బాబాయ్ వైఎస్ వివేకాను హత్యచేసిన వారిని, చేయించినవారిని జగన్ వెనకేసుకువస్తున్నారు. హంతకులకు శిక్షపడకుండా జగన్ కాపాడుతున్నారు. వివేకాను హత్య చేయించిన అవినాష్కు టికెట్ ఇచ్చారు. చిన్నాన్నను హత్య చేయించిన వారికి టికెట్ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అవినాష్కు టికెట్ ఇచ్చారు. కడప ఎంపీగా నేను పోటీచేయాలనేది మా చిన్నాన్న వివేకా కోరిక. అందుకే ఆయన కోరికను నెరవేర్చడానికి కడప ఎంపీగా పోటీ చేస్తున్నా" అని షర్మిల చెప్పుకొచ్చారు.
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా చేయడమే తన లక్ష్యమని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. వివేకా హత్యకేసులో దోషులకు శిక్షపడాలని సునీత కోర్టులు చుట్టూ తిరుగుతోందని షర్మిల అన్నారు. ఓవైపు న్యాయం కోసం సునీత పోరాడుతుంటే.. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవకూడదనే ఉద్దేశంతోనే కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని షర్మిల ప్రకటించారు. మరోవైపు షర్మిలతో పాటుగా వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa