ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి కనిపించను న్నారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలుల్లో ప్రజాగళం సభలను నిర్వహించనున్నారు. ఇరువురు నేతలు రోడ్ షో నిర్వహించి, తణుకు నరేంద్ర సెంటర్లో సభలో మాట్లాడతారు. ప్రజాగళం విజయవంతానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు ఇద్దరు నేతలు వేర్వేరుగా హెలీక్యాఫ్టర్లలో తణుకు పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొంటారు. నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ నుంచి కూటమి అభ్యర్థి ఆరిమిల్లికి సహకారం లేకపోయినా, ఆ పార్టీ నాయకులు, కేడర్ అంతా మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభను నిర్వహించా యి. ఇరు పార్టీల అధినేతల సభలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సభ సూపర్ సక్సెస్ అయ్యింది. అదే తర హాలో తణుకులోనూ సభను విజయవంతం చేయా లనే పట్టుదలతో కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు ప్రకటన తర్వాత ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి రానుండడంతో కేడర్లోనూ జోష్ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa