తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధ నామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు దశావతారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటి పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఉగాది పండుగ వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నేడు పంట కాలం కూడా ప్రారంభమవుతుంది. దీంతోపాటు శ్రీరాముడు, యుధిష్ఠిరుల పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో నేడు సంతోషం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. ఈ తెలుగు పండుగను దక్షిణ భారతదేశం అంతటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa