ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీపై వారణాసిలో ట్రాన్స్‌జెండర్ పోటీ.. ఎవరీ హేమాంగి సఖి మాత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2024, 07:14 PM

ఈ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పోటీలో దిగారు. ఇప్పటికే ప్రధానిగా ఎన్నికైన రెండుసార్లు వారణాసి నుంచి గెలిచిన నరేంద్ర మోదీ.. మరోసారి అక్కడే గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధానిగా కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక గత 2 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని అయిన మోదీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ని బరిలోకి దింపింది. ఈ క్రమంలోనే అదే వారణాసి నియోజకవర్గం నుంచి ఒక ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ తరఫున హేమాంగి సఖి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.


మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. ఆమె ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు కూడా. అయితే అఖిల భారత హిందూ మహాసభ.. ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అఖిల భారత హిందూ మహాసభ.. ప్రధానికి పోటీగా వారణాసిలో హేమాంగి సఖి మాతను నిలబెట్టింది.


గుజరాత్‌లోని బరోడాలో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. హేమాంగి సఖి మాత తండ్రి ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో వారి కుటుంబం గతంలోనే ముంబైకి వలస వెళ్లింది. ఇక హేమాంగి సఖి మాతకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్‌జెండర్‌ కథకురాలిగా హేమాంగి సఖి మాత ఖ్యాతిని పొందారు. 2019 ఆచార్య మ‌హామండ‌లేశ్వర్‌గా హేమాంగి సఖి ప‌ట్టాభిషేకం చేశారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వారణాసిలో జూన్ 1 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4 వ తేదీన వెలువడనున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa