బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ‘బాబు కోసం మేము సైతం’ కార్యక్రమాన్ని ఈనెల 14వతేదీన బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ తెలిపారు. కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆయన మంగళవారం అమరాపు రం, రొళ్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బెంగళూరు నుంచి ఉగాది కోసం వచ్చిన పలువురు యువతను కలిశారు. బాబు కోసం మేము సైతం అనే కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వారికి వివరించారు. బెంగళూరులోని బగలగుంట ప్రాంతంలో ఉన్న శ్రీసాయి కల్యాణ మండపంలో 14న ఉదయం 10 గంటలకు బగలగుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీవీ వెంకటరాయుడు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితోపాటు పలువురు జిల్లానేతలు సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. కావున అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సునీల్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa