ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ వ్యవస్థపై నీచంగా మాట్లాడింది మీరు కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 01:44 PM

చంద్ర‌బాబుకు మ‌తిభ్ర‌మించింద‌ని మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. చంద్రబాబు నుంచి బోండా ఉమా వరకూ కూటమికి ఓటమి భయం పట్టుకుంద‌న్నారు. బుధ‌వారం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌వ‌ర్గంలో వెలంప‌ల్లి ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.... వాలంటీర్లు బస్తాలు మోస్తారన్నాడు. ఇంటికి వెళ్లి తలుపులు కొడతారన్నారు. మహిళలు మిస్సింగ్ అవుతున్నారన్నారు, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సానుభూతి చూపిస్తున్నాడు. శుంఠ పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై నీచంగా మాట్లాడలేదా?. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు సిగ్గు శరం లేదు. నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి వాలంటీర్ వ్యవస్థపై దొంగ కేసులు బనాయించారు. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్, లోకేష్.చంద్రబాబు మొన్న 50,000 అని ఈరోజు 10,000 అంటున్నాడు.చంద్రబాబుకు మతిభ్రమించింది. 2014లో చంద్రబాబు లోకేష్‌కి ఉద్యోగం ఇప్పించాడు.. అది మంత్రి ఉద్యోగం.లోకేష్‌కి మంగళగిరిలో మళ్లీ ఓటమి తథ్యం దత్తపుత్రుడు పవన్ పిఠాపురంలో ఓడిపోతాడు.175 నియోజకవర్గాల్లో గెలిచేది సీఎం జగనే. చంద్రబాబు, పవన్, లోకేష్, పురంధేశ్వరిని ప్రజలు ఓడించడం ఖాయం.పవన్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి.. రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడు. టీడీపీ, జనసేన పార్టీలను ఎన్నికల తర్వాత బీజేపీలో విలీనం చేస్తారు. శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు,నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు కేసీఆర్‌తో శవ రాజకీయాలు చేయలేదా?చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా?సీఎం జగన్‌ కుటుంబంలో చిచ్చులు పెట్టి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ది పొందాలన్నది చంద్రబాబు ఆలోచన.హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. సీఎం జగన్ దుర్మార్గులపై అర్జునుడిలా పోరాటం చేస్తున్నారు అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa