ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ సభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముందు దూసుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాగళం సభలు నిర్వహిస్తూ వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే రేపటి (శనివారం) నుంచి పలు నియోజకవర్గాల్లో జరిగే ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పలు సభల్లో పాల్గొనున్నారు. 16, 17 తేదీల్లో జరిగే సభలు, రోడ్షోలలో ఇరువురు నేతలు పాల్గొంటారు. నేటితో కలిపి ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి అయ్యాయి. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ప్రజాగళం సభలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రజాగళం షెడ్యూల్ను టీడీపీ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa