ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను వంచించడానికే కూటమి ఏర్పడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 04:31 PM

ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే  అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా  రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని ధ్వ‌జ‌మెత్తారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. వైయ‌స్ఆర్ జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్ర‌తిప‌క్ష‌ నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa