ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాన్ బోల్తా, బయటపడ్డ అసలు నిజం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:20 AM

ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఏపీకి గుట్టుగా నగదు తరలిస్తున్న బస్తాల వ్యాన్ బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అయితే వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో బోల్తా పడింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళుతున్న వ్యాన్ బోల్తాపడిన క్రమంలో వ్యాన్ అడుగుభాగంలో నాలుగు బాక్సులను అధికారులు గుర్తించారు. వాటిలో నగదును తరలిస్తున్నట్టుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. వాటిని ఉన్నతాధికారుల సమక్షంలో ఓపెన్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే ఎన్నికల సమయంలో గుట్టుగా తెలియకుండా అడుగున బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa