ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 03:51 PM

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ అన్నారు. శనివారం గజపతినగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల విధులుపై పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. ఎన్నికల విధులకు సమయపాలన తప్పనిసరి అన్నారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకట అప్పారావు, గజపతినగరం సిఐ ఎన్ వి ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa