జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనానికి మంగళగిరిలో ఓటు హక్కు ఉండటంతో.. తనకు తాను ఓటేసుకోలేకపోయారు. అయితే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సతీసమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఓ పార్టీ అధినేతగా, బాధ్యత గల పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఓటేయడం పెద్ద ప్రత్యేకమైన విషయమేం కాదు. కానీ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి రావడమే స్పెషల్. విజయవాడకు చెందిన పోతిన మహేశ్.. ఎన్నికల ముందు జనసేన పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన విషయం విదితమే. జగన్ పార్టీలో చేరిన అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల రోజుల క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన పోతిన మహేష్.. చివర్లో ‘పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహ ప్రవేశం చేస్తున్నారు, సంతోషం. ఈ పూజకి అన్నా లెజినోవా గారితో హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.
ఉగాది పర్వదినాన.. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి హాజరు కాలేదు. పోతిన మహేశ్ అంతకు ముందే.. మీ భార్యతో కలిసి గృహ ప్రవేశం చేయండి చూద్దాం అన్నట్టుగా మాట్లాడటం.. తీరా జనసేనాని ఒక్కడే పూజలో కూర్చోవడంతో.. పవన్-అన్నా లెజినోవా దంపతుల మధ్య సఖ్యత లేదేమో.. వారిద్దరూ కలిసి ఉండటం లేదేమో అనే అనుమానాలు తలెత్తాయి. అన్నా లెజినోవా ఈ ఏడాది ఆరంభంలోనే రష్యా వెళ్లారని.. ఆమె ఇంకా తిరిగి రాలేదని కూడా ప్రచారం మొదలుపెట్టారు.
పవన్ గృహ ప్రవేశ కార్యక్రమం ముగిసీ ముగియక ముందే.. ప్రత్యర్థులు ఆయన్ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చినోడికి మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు అన్నట్టుగా మాట్లాడిన వారూ ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. అంతే కాదు.. ఆమె సగటు భారతీయ మహిళలా.. చీరకట్టులో ఆమె వచ్చారు. దీంతో సరైన సమయంలో పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించినట్లయ్యింది.
‘కొన్నిసార్లు రావడం లేటు కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’ అనే గోపాల గోపాల సినిమా డైలాగ్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. పోతిన మహేశ్కు.. పవన్ కళ్యాణ్ దంపతుల ఫొటో చూపించి, చూశావా మహేశా అని అడిగినా అడిగేస్తున్నారు. కొందరైతే.. తప్పుడు ప్రచారం చేసినందుకు సిగ్గు తెచ్చుకో అని పోతిన మహేశ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఉగాది పర్వదినాన పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ . జనసేనాని తన భార్యతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పోతిన మహేశ్ సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa