ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేసేవి ఎన్నికలు అని చెప్పిన చంద్రబాబు.. ఓటు మీ జీవితాన్నే మారుస్తుందని అన్నారు. ప్రజలంతా తమ ఓటుహక్కుు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విదేశాల నుంచి కూడా ఏపీ ప్రజలు తరలివస్తున్నారన్న చంద్రబాబు.. సొంత ఖర్చులతో అంత దూరం నుంచి ఓటేయడానికి రావటాన్ని అభినందించారు. అమెరికాతో సహా విదేశాల నుంచి అలాగే బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీవాసులకు ఓటేసేందుకు తరలివస్తున్నారన్న చంద్రబాబు.. ఇతం పెద్ద సంఖ్యలో తరలిరావడాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
మరోవైపు ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు, అన్నమయ్య జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపైనా చంద్రబాబు స్పందించారు, రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదన్న టీడీపీ అధినేత.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa