ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్వీపర్ల జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ పీలేరు ప్రధాన కార్య దర్శి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీలేరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం స్వీపర్లకు నెలకు కేవలం రూ.6 వేల వేతనం ఇస్తోందని, దానిని కూడా నెలనెలా చెల్లించకుండా ఆరు నెలలుగా పెండింగ్లో పెట్టిందని తెలిపారు. అసలే అరకొరా జీతాలతో రోజంతా పనిచేసే స్వీపర్లు, ఆ జీతం కూడా నెల నెలా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలతోపాటు స్వీపర్లకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యమని, ఇప్పటికైనా పట్టించుకోకుండే ఉద్యమాలు తప్పవని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నరసింహులు, యశోదా, వెంకట రత్నమ్మ, పద్మావతి, రమాదేవి, సుమతి, రెడ్డమ్మ, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa